టీడీపీలోకి భవకుమార్!
విజయవాడలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు భవకుమార్ తో టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్ రావు, వంగవీటి రాధా, కేశినేని చిన్ని భేటీ అయ్యారు. నాారా లోకేశ్ తో భవకుమార్ భేటీ అయ్యారు. వైసీపీలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని భవకుమార్ అన్నారు. త్వరలో ఆయన వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. భవకుమార్ పార్టీని వీడికుండా దేవినేని అవినాశ్, వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.