Sports

PM Modi: ఒలింపిక్స్ నిర్వహణ 140 కోట్ల మంది భారతీయుల కల- ప్రధాన మంత్రి మోడీ



<p>ఒలింపిక్స్ &nbsp;క్రీడలు నిర్వహించడం 140 కోట్ల భారతీయుల కల అన్నారు ప్రధాన మంత్రి మోడీ. 40 ఏళ్ల విరామం తర్వాత ఐఓసీ సెషన్&zwnj;ను, భారత్&zwnj;లో నిర్వహించడం దేశానికి ఎంతో గర్వకారణమన్నారు. 2036లో జరిగే ఒలింపిక్స్&zwnj;కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ బిడ్డింగ్ వేస్తుందని మోడీ స్పష్టం చేశారు. ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశాన్ని ప్రధాని ప్రారంభించారు. 40 ఏళ్ల విరామం తర్వాత ఐఓసీ సెషన్&zwnj;ను భారత్&zwnj;లో నిర్వహించడం దేశానికి ఎంతో గర్వకారణమన్నారు. అహ్మదాబాద్&zwnj;లో పాకిస్తాన్ తో జరిగిన క్రికెట్ మ్యాచ్&zwnj;లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు టీమ్ ఇండియా శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలు మన సంస్కృతి, జీవనశైలిలో ముఖ్యమైన భాగమన్న మోడీ, &nbsp;క్రీడలు ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అనే భావనను బలపరుస్తున్నాయని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో క్రీడా కార్యకలాపాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.&nbsp;</p>
<p><strong>ఏ అవకాశాన్ని వదులుకోం</strong><br />సింధు నాగరికత నుంచి వేద యుగం వరకు, భారతదేశంలోని ప్రతి కాలంలో క్రీడల వారసత్వం సుసంపన్నంగా ఉందన్నారు మోడీ. ఇటీవలి &nbsp;కాలంలో భారతదేశం ప్రధాన క్రీడా కార్యక్రమాలను నిర్వహించే సామర్థ్యాన్ని సంపాదించుకుందున్నారు. దేశంలో ఒలింపిక్స్&zwnj;ను నిర్వహించేందుకు భారత్ ఆసక్తిగా ఉందని. 2036లో ఒలింపిక్స్&zwnj;ను విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహకంగా భారత్ ఎటువంటి అవకాశాన్ని వదులుకోదని స్పష్టం చేశారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల కల అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. 2036 ఒలింపిక్స్ కు ముందు 2029 యూత్ ఒలింపిక్స్&zwnj;కు ఆతిథ్యం దేశం ఇవ్వాలనుకుంటోందని, ఐఓసీ నుంచి భారత్&zwnj;కు నిరంతరం మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. 2036 ఒలింపిక్స్&zwnj;ను నిర్వహించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని భారత్ వదిలిపెట్టదని మోడీ అన్నారు.</p>
<p><strong>భారత్ పై థామస్ బాచ్ ప్రశంసలు</strong><br />హాంగ్&zwnj;జౌలో జరిగిన ఆసియా క్రీడలలో భారత అథ్లెట్ల అద్భుతమైన ప్రదర్శన చేశారని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రశంసలు కురిపించారు. పతకాల్లో సాధించడంలో గత రికార్డు బద్దలు కొట్టిన భారత్&zwnj;కు అభినందనలు తెలిపారు. ఇది భారత ఒలింపిక్ సంఘం గర్వించదగిన విషయమన్నారు. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్ &nbsp;క్రీడలు, ప్రీ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో చివరివని స్పష్టం చేశారు. భారత్ లో ఐఓసీ సెషన్&zwnj;ను నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు థామస్ బాచ్. &nbsp;అద్భుతమైన చరిత్ర, డైనమిక్ వర్తమానాన్ని భవిష్యత్తులో బలమైన విశ్వాసంతో మిళితం చేసే దేశమన్నారు.&nbsp;</p>
<p><strong>40 ఏళ్ల విరామం తర్వాత</strong><br />40 ఏళ్ల విరామం తర్వాత భారత్ రెండోసారి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్&zwnj;కు ఆతిథ్యం ఇస్తోంది. 1983లో ఐఓసీ తన 86వ సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించింది. సెషన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుల ముఖ్యమైన సమావేశం. ఐఓసీ సెషన్లలో ఒలింపిక్ క్రీడల భవిష్యత్తుపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సెషన్&zwnj;లో ఐఓసీ సభ్యులు, ప్రముఖ భారతీయ క్రీడాకారులు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్&zwnj;తో సహా వివిధ క్రీడా సమాఖ్యల ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొణే పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్&zwnj;కు మరింత ఆదరణ లభిస్తుండటంతో 2028 ఒలింపిక్స్&zwnj;లో క్రికెట్&zwnj;&zwnj;కు చోటు కల్పించింది.&nbsp;</p>
<p>&nbsp;</p>



Source link

Related posts

పాండ్యాకు జై అనాలా…బండ బూతులు తింటున్న మంజ్రేకర్.!

Oknews

RCB WPL 2024 టైటిల్ సాధించటంతో బెంగళూరులో అర్ధరాత్రి దాటేదాకా సాగిన ఫ్యాన్స్ సంబరాలు

Oknews

Mumbai Clinches Ranji Title By Beating Vidarbha In The Final

Oknews

Leave a Comment